మెరుగైన వైద్యసేవలు అందించాలి : జేసీ
ABN , First Publish Date - 2021-06-18T03:00:14+05:30 IST
వైద్యంకోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జేసీ విదేహ్ఖరే అన్నారు. గురువా
గూడూరురూరల్, జూన్ 17: వైద్యంకోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జేసీ విదేహ్ఖరే అన్నారు. గురువారం స్థానిక ఏరియా ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులను, రక్తనిధి, సిటీస్కాన్సెంటర్, డయాలసీస్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ బాధితులకు అసౌకర్యం కలుగకుండా వైద్యసేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలికవసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెండ్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్లు శైలజ, రాజా తదితరులు పాల్గొన్నారు.