ములుగు జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం
ABN , First Publish Date - 2022-01-20T13:07:00+05:30 IST
ల్లాలోని ఏటూరునాగారంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.
ములుగు: జిల్లాలోని ఏటూరునాగారంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్కైవిజన్ టెలీనెట్ వర్క్ ఆఫీసులోకి దొంగలు చొరబడి సాటిలైట్ బాక్స్లు, నెట్వర్క్స్ లైన్స్ ధ్వంసం చేశారు. 70వేల నగదును అపహరించారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై దాడి చేశారు. దొంగలు ఆఫీసులో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆఫీసు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.