వెళుతున్న లారీలో.. సెల్‌ఫోన్ల దోచేశారు!

ABN , First Publish Date - 2020-09-17T09:51:25+05:30 IST

జాతీయ రహదారిపై సినీఫక్కీలో దోపిడీ జరిగింది. రోడ్డుపై వెళుతున్న కంటైనర్‌ను మరో వాహనంలో వెంబడించిన...

వెళుతున్న లారీలో.. సెల్‌ఫోన్ల దోచేశారు!

మంగళగిరి క్రైమ్‌, సెప్టెంబరు 16: జాతీయ రహదారిపై సినీఫక్కీలో దోపిడీ జరిగింది. రోడ్డుపై వెళుతున్న కంటైనర్‌ను మరో వాహనంలో వెంబడించిన దుండగులు.. కంటైనర్‌ లాకులను కట్టర్‌తో తొలగించి అందులోకి ప్రవేశించారు. రూ.80 లక్షల విలువైన సెల్‌ఫోన్లు కొట్టేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి బుధవారం తెలిపిన వివరాలు.. చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుంచి ఎంఐ సెల్‌ఫోన్ల లోడుతో కంటైనర్‌ కోల్‌కతాకు బయలుదేరింది. మంగళవారం అర్థరాత్రి గుంటూరు సమీపంలోకి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు కంటైనర్‌లోకి చొరబడ్డారు. 49 అట్టపెట్టెల్లో ఉన్న 980 సెల్‌ఫోన్లను దోచుకున్నారు. 

Updated Date - 2020-09-17T09:51:25+05:30 IST