చిరమన గుడిలో చోరీ యత్నం
ABN , First Publish Date - 2020-11-28T05:23:35+05:30 IST
చిరమన చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. గుడి తాళాలు ప
ఏఎస్పేట, నవంబరు 27: చిరమన చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. గుడి తాళాలు పగులకొట్టి గర్భగుడిలోకి ప్రవే శించి ఒకవైపు ఉన్న రాళ్లను తొలగించడానికి ప్రయత్నించారు. ఉదయం గుడి తాళాలు పగలకొట్టిన విషయం గమనించారు. పంచ లోహ విగ్రహాలు, ఆభరణాలు చోరీకి గురి కాలేదని..కేవలం గోడను మాత్రం పగులకొట్టిన ట్లు గుర్తించారు. ఈవో ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుబాహని కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.