ఉత్సాహంగా...‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ చిత్రలేఖన పోటీలు

ABN , First Publish Date - 2022-06-07T22:55:43+05:30 IST

కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్యం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తి అయిన సంధర్భంగా మంగళ వారం నగరం లో

ఉత్సాహంగా...‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ చిత్రలేఖన పోటీలు

హైదరాబాద్: కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన  రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్యం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తి అయిన సంధర్భంగా మంగళ వారం నగరం లో  విద్యార్థులకు ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్’ అంశం పై చిత్రలేఖనం, వకృత్వ్ి, దేశభక్తి గేయాల పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో పద్మారావు నగర్ లోని గ్లోబల్ ఆర్ట్ ఇన్స్ స్టిట్యూట్, అశోక్ నగర్ లోని అనలాగ్  ఐఎసి కోచింగ్ సెంటర్, అప్సా ఎన్.జి.ఒ  ట్రైనింగు సెంటర్ లోని సుమారు 100 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నామని ఆర్ఒబి అసిస్టెంట్ డైరెక్టర్ ఐ.హరిబాబు తెలిపారు.

Updated Date - 2022-06-07T22:55:43+05:30 IST