అడుగుకో గొయ్యి..!

ABN , First Publish Date - 2020-10-17T11:17:08+05:30 IST

భారీ వర్షాలకు రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

అడుగుకో గొయ్యి..!

వర్షాలకు రూపు కోల్పోయిన రహదారులు 

 మాదేపల్లి, జాలిపూడి, శ్రీపర్రు రోడ్డు మరీ అధ్వానం

 కంకర తేలి.. బురదతో నిండిన గోతులు  

 

ఏలూరు రూరల్‌:  భారీ వర్షాలకు రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇవి రోడ్లేనా అన్నంత అధ్వానంగా పలు ప్రాంతాల్లో  ఉన్నాయి.  ఏలూరు రూరల్‌ మండలంలోని మాదేపల్లి, జాలిపూడి, శ్రీపర్రు వెళ్లే రోడ్డు అడుగుకంటే ఎక్కువ లోతుగా గుంతలు, కంకర, దుమ్ముతేలి ప్రయాణించలేని స్థితికి చేరాయి. ఇదే దారి వెంట శుక్రవారం వరద బాధితులను పరామర్శిం చేందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, మత్స్యశాఖ మంత్రి అప్పల రాజు ప్రయాణించారు. వారి కాన్వాయ్‌లోని వాహనాలు గోతుల్లో పడుతూ లేస్తూ వెళ్లడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు అధ్వానంగా మారిన రోడ్లపై దృష్టి సారించాలని ప్రజానీకం కోరుతున్నారు.    


Updated Date - 2020-10-17T11:17:08+05:30 IST