ఏపీలో రోడ్లన్నీ నరకకూపాల్లా మారాయి: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2021-10-01T22:17:55+05:30 IST

ఏపీలో రోడ్లన్నీ నరకకూపాల్లా మారాయని, ఆర్ అండ్ బీ శాఖ మూతపడిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు

ఏపీలో రోడ్లన్నీ నరకకూపాల్లా మారాయి: సోమిరెడ్డి

అమరావతి: ఏపీలో రోడ్లన్నీ నరకకూపాల్లా మారాయని, ఆర్ అండ్ బీ శాఖ మూతపడిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ప్రభుత్వంలో చలనంలేదని తప్పుబట్టారు. ఎవరు డబ్బులిస్తే వారికే కాంట్రాక్టులు, చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఆర్థికశాఖ అధికారి సత్యనారాయణ 15శాతం చెల్లింపులు చేస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారని, ఏ ఫైల్ క్లియర్ చేయాలన్నా 90 రోజుల సమయం తీసుకుంటున్నారని తెలిపారు. ప్యాచ్ వర్క్‌కు జనసేన ముందుకొస్తే ప్రభుత్వానికి ఇబ్బందేంటి? అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2021-10-01T22:17:55+05:30 IST