రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-01-28T02:32:45+05:30 IST
మండలంలోని గొల్లపల్లి వద్ద గురువారం జరిగిన జరిగిన రోడ్డు ప్రమాంలో ఓ వ్యక్తి మృతి మృతి చెందాడు. కడప జిల్లాకు చెంది
ఆత్మకూరు, జనవరి 27 : మండలంలోని గొల్లపల్లి వద్ద గురువారం జరిగిన జరిగిన రోడ్డు ప్రమాంలో ఓ వ్యక్తి మృతి మృతి చెందాడు. కడప జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు కసుమూరు దర్గాను దర్శించుకుని తిరిగి మోటారు బైకుపై వెళుతుండగా గొల్లపల్లి సమీపంలో నెల్లూరు- ముంబాయి జాతీయ రహదారిపై మోటారుబైకు అదుపు తప్పడంతో ప్రమాదానికి గురయ్యారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రగాయాలైన రహమాన్(25) పరిస్థితి విషమించి వైద్యశాల వద్ద మృతి చెందాడు. మరో యువకుడు మహ్మద్ ఫజుల్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.