ఆ రహదారి మాకొద్దు

ABN , First Publish Date - 2022-06-15T13:44:47+05:30 IST

‘పొన్నేరి సమీపం తచ్చూరు - చిత్తూరు మధ్య ఆరు లేన్ల జాతీయ రహదారి మాకొద్దు’ అని పెరియపాళయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఇటీవల

ఆ రహదారి మాకొద్దు

చెన్నై, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ‘పొన్నేరి సమీపం తచ్చూరు - చిత్తూరు మధ్య ఆరు లేన్ల జాతీయ రహదారి మాకొద్దు’ అని పెరియపాళయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.3200 కోట్ల వ్యయంతో తచ్చూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు వరకు 136 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు వారం రోజులుగా పెరియపాళం వద్ద జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులు సర్వే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఎక్స్‌కవేటర్‌ యంత్రాల ద్వారా పెరియపాళయం వద్దనున్న తండలం, పాలవాక్కం, పరుత్తిమేని కుప్పం, పొందవాక్కం, వెంగళత్తూరు, పిచ్చాటూరు ప్రాంతాల్లో నేలను చదును చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఈ రహదారి నిర్మాణపు పనుల వల్ల తమ పంటపొలాలను కోల్పోతామని పెరియపాళయం ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులు రైతులతో చర్చలు కొనసాగించారు. చర్చలు ఫలించలేదు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2022-06-15T13:44:47+05:30 IST