జాతీయ రహదారిపై రాకపోకలు బంద్‌

ABN , First Publish Date - 2020-11-28T05:14:53+05:30 IST

సంగం - ఆత్మకూరు మధ్య పెరమన సమీపంలో ముంబాయి జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నుంచి వాహన రాకపోకలను

జాతీయ రహదారిపై రాకపోకలు బంద్‌
సంగం కూడలిలో జాతీయరహదారిపై నిలిచిపోయిన వాహనాలు

సంగం, నవంబరు 27: సంగం - ఆత్మకూరు మధ్య పెరమన సమీపంలో ముంబాయి జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నుంచి వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పెన్నా నీటితో పాటు బొగ్గేరు, బీరాపేరు నీటి ప్రవాహంతో పెరమన క్రాస్‌ రోడ్డుకు సమీపంలో ముంబాయి జాతీయ రహదారిపై వరద నీళ్లు ప్రవహించడంతో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి, కడప వైపు వెళ్లే వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. కోలగట్లలో శుక్రవారం ఓ రైతు, చేపల గుంటల్లో చేపలు పట్టేందుకు వెళ్లిన కూలీలు పెన్నా వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు బోటు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

  

Updated Date - 2020-11-28T05:14:53+05:30 IST