బైక్‌ను ఢీకొన్న కారు..మహిళ దుర్మరణం

ABN , First Publish Date - 2022-08-10T05:48:17+05:30 IST

వివాహ కార్యక్రమానికి హాజరై మోటారుసైకిల్‌పై ఇంటికి వెళుతున్న భార్యాభర్తలను డ్రైవింగ్‌స్కూలు కారు వెనుకనుంచి ఢీకొనడంతో భార్య మృతి చెందింది. ఈ సంఘటన 216 జాతీయ రహదారి అనాతవరం వద్ద మంగళవారం జరిగింది.

బైక్‌ను ఢీకొన్న కారు..మహిళ దుర్మరణం

ముమ్మిడివరం, ఆగస్టు 9: వివాహ కార్యక్రమానికి హాజరై మోటారుసైకిల్‌పై ఇంటికి వెళుతున్న భార్యాభర్తలను డ్రైవింగ్‌స్కూలు కారు వెనుకనుంచి ఢీకొనడంతో భార్య మృతి చెందింది. ఈ సంఘటన 216 జాతీయ  రహదారి అనాతవరం వద్ద మంగళవారం జరిగింది. అమలాపురం రూరల్‌ మండలం కామనగరువుకు చెందిన గుద్దటి వెంకటరత్నం,  అతని  భార్య అమ్మాజీ (55)లు మోటారుసైకిల్‌పై వివాహానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం  జరిగింది. మోటారుసైకిల్‌పై వెళుతున్న వీరిని ఓ డ్రైవింగ్‌స్కూల్‌కు చెందిన కారు వెనుక నుంచి ఢీకొనగా వారు అదుపుతప్పి పడిపోగా అమ్మాజీ పైనుంచి ఆ కారు వెళ్లిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయపడిన అమ్మాజీని అమలాపురం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈమేరకు ముమ్మిడివరం ఎస్‌ఐ కె.సురేష్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అమ్మాజీకి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - 2022-08-10T05:48:17+05:30 IST