పాదచారుడిని ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు మృతి

ABN , First Publish Date - 2022-04-27T12:23:13+05:30 IST

భోగాపురం మండలంలో తెల్లవారుజామున అవ్వపేట బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదచారుడిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో

పాదచారుడిని ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు మృతి

విజయనగరం: భోగాపురం మండలంలో తెల్లవారుజామున  అవ్వపేట బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదచారుడిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  బైక్‌ పైనుంచి పడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు బంగార్రాజుపేట వాసి వీరబాబు(32), విజయవాడ వాసి ఈశ్వరరావు(33)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-04-27T12:23:13+05:30 IST