రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
ABN , First Publish Date - 2022-04-17T13:08:18+05:30 IST
మేట్టుపాళయం సమీపంలో కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా, మరి కొందరికి గాయాలయ్యాయి. మేట్టుపాళయం కాట్టూరు ప్రాంతానికి చెం దిన మహమ్మద్
పెరంబూర్(చెన్నై): మేట్టుపాళయం సమీపంలో కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా, మరి కొందరికి గాయాలయ్యాయి. మేట్టుపాళయం కాట్టూరు ప్రాంతానికి చెం దిన మహమ్మద్ దవుపీక్ (16), మహమ్మద్ ఆరీఫ్ (16), ఇర్ఫాన్ (18), ఖాలీబ్ (16) సెలవు రోజులు కావడంతో కారులో కోతగిరికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. కోతగిరి రోడ్డు సమీపం ప్రభుత్వ కళాశాల సమీపంలో వస్తున్న కారు హఠాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో మహమ్మద్ దవుపీక్, మహమ్మద్ ఆరీఫ్ సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. కారు నడిపిన ఇర్షాన్ సహా ముగ్గురిని చుట్టుపక్కల వారు రక్షించి మేట్టుపాళయం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సల అనంతరం కోవై ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై మేట్టుపాళయం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.