రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-14T15:02:00+05:30 IST

రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రెండు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. చెంగల్పట్టు జిల్లా తిరుకళకుండ్రం ప్రాంతానికి చెందిన కపిలన్‌ (22)

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రెండు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. చెంగల్పట్టు జిల్లా తిరుకళకుండ్రం ప్రాంతానికి చెందిన కపిలన్‌ (22) తాంబరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కపిలన్‌ శుక్రవారం ఉదయం కారులో  కళాశాలకు బయల్దేరాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో కీర్‌పాక్కం మార్గంగా వస్తున్న కారును చెన్నై నుంచి కల్పాక్కం వైపునకు వెళుతున్న ప్రభుత్వ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జుకాగా, తీవ్రగాయాలతో కపిలన్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు.


కన్నియాకుమారిలో...

కన్నియాకుమారి సమీపం కరుంబాట్టూర్‌ గ్రామానికి చెందిన సైజిన్‌ (19) అదే ప్రాంతంలోని ఓ పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితులు దేవజాస్పర్‌ (20), ప్రవీణ్‌ (18)లతో కలసి గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో బైక్‌పై కన్నియాకుమారి బయల్దేరారు. సైజిన్‌ నడుపుతున్న మోటార్‌ సైకిల్‌ కన్నియాకుమారి బస్టాండ్‌ సమీపంలో వస్తుండగా హఠాత్తుగా ప్రభుత్వ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో సైజిన్‌, దేవజాస్పర్‌ తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, ప్రవీణ్‌కు కూడా బలమైన గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు ప్రవీణ్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు దేవజాస్పర్‌ కన్నియాకుమారిలోని ఓ కూరగాయల దుకాణంలో పనిచేస్తుండగా, ప్రవీణ్‌ పాలిటెక్నిక్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Read more