రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ సహా బాలిక మృతి
ABN , First Publish Date - 2022-04-16T13:47:08+05:30 IST
కళ్లకుర్చి జిల్లా శంకరాపురం సమీపంలో శుక్రవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ సహా ఇద్దరు మృతిచెందారు. తిరువారూర్ జిల్లా కీళపావత్తుకుడి దక్షిణకాళి నగర్ చెందిన
పెరంబూర్(చెన్నై): కళ్లకుర్చి జిల్లా శంకరాపురం సమీపంలో శుక్రవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ సహా ఇద్దరు మృతిచెందారు. తిరువారూర్ జిల్లా కీళపావత్తుకుడి దక్షిణకాళి నగర్ చెందిన రాజామణి (50) సాంఘిక సంక్షేమ శాఖ సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. కళ్లకుర్చి జిల్లా శంకరాపురంలోని తన కార్యాలయానికి వెళ్లేందుకు ఉదయం 9 గంటలకు కారులో బయల్దేరారు. ఫరూఖ్ నడుపుతున్న కారు శంకరాపురం తహసీల్దార్ కార్యాలయ సమీపంలో వస్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో పాటు ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న గోపిక (11) అనే బాలికను కూడా ఢీకొంది. ఈ ఘటనలో రాజామణి, గోపిక మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై శంకరాపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఒత్తల గుండు సమీపంలో...: దిండుగల్ జిల్లా ఒత్తలగుండు ముత్తలాపురంకు చెందిన ప్రకాష్, సంతోష్ పాండి, గోపాల్ కలిసి ద్విచక్రవాహనంలో నీలకోటకు బయల్దేరారు. వత్తలగుండు-మదురై జాతీయ రహదారి సమీపంలోని పూజారిపట్టి జంక్షన్లోముందువెళ్తున్న బస్సునుఓవర్టేక్చేసే ప్రయ త్నంలో ఎదురుగా వచ్చిన ప్రైవేటు బస్సును ఢీకొనడంతో ముగ్గురూ మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.