శ్రీకాకుళంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన బస్సు
ABN , First Publish Date - 2022-06-20T12:57:57+05:30 IST
నందిగాం మండలం పెద్దతామరపల్లిలో వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో
శ్రీకాకుళం: నందిగాం మండలం పెద్దతామరపల్లిలో వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 22 మందికి తీవ్రగాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు వలస కార్మికులతో పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.