రోడ్డు ప్రమాదంలో Si దుర్మరణం

ABN , First Publish Date - 2022-07-20T16:01:33+05:30 IST

కాంచీపురం జిల్లా చిన్నయప్పన్‌ సత్రం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతిచెందారు. ఆ జిల్లాలోని సుంకువారిసత్రం

రోడ్డు ప్రమాదంలో Si దుర్మరణం

చెన్నై, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కాంచీపురం జిల్లా చిన్నయప్పన్‌ సత్రం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతిచెందారు. ఆ జిల్లాలోని సుంకువారిసత్రం పోలీసుస్టేషన్‌లో కాంచీపురం వెళంగపట్టరై ప్రాంతానికి చెందిన తిరుమురుగన్‌ (59) సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు పాండిసెల్వి అనే భార్య, అశోక్‌కుమార్‌, ఆనంద్‌ అనే కుమారులు ఉన్నారు.  మంగళవారం ఉదయం తిరుమురుగన్‌ బైకుపై డ్యూటీకి వెళుతుండగా చిన్నయప్పన్‌ సత్రం వద్ద వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ఢీకొనడంతో ఆయన ఆ స్థలంలోనే దుర్మరణం చెందారు. తిరుమురుగన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత ఆయన స్వస్థలమైన దిండుగల్‌ జిల్లా శివగిరిపట్టికి తరలించారు. 

Updated Date - 2022-07-20T16:01:33+05:30 IST