కారు ఢీకొని si మృతి
ABN , First Publish Date - 2021-10-20T12:27:38+05:30 IST
స్థానిక మెరీనా బీచ్ సమీపంలోని కామరాజర్ రోడ్డు దాటుతున్న ఎస్ఐ కారు ఢీకొని మృతి చెందారు. విల్లుపురం జిల్లా కోవిలూర్కు చెందిన ప్రసన్న(26) స్థానిక డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నికల్ విభాగం ఎస్ఐ
పెరంబూర్(chennai): స్థానిక మెరీనా బీచ్ సమీపంలోని కామరాజర్ రోడ్డు దాటుతున్న ఎస్ఐ కారు ఢీకొని మృతి చెందారు. విల్లుపురం జిల్లా కోవిలూర్కు చెందిన ప్రసన్న(26) స్థానిక డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నికల్ విభాగం ఎస్ఐగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న ప్రసన్న కార్యాలయం వెలుపలికి వచ్చి రోడ్డు దాటేందుకు నడిచే సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రసన్నను చుట్టుపక్కల వారు అంబులెన్స్లో రాజీవ్గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలో ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అన్నా స్క్వయర్ పోలీసులు కారు నడుపుతున్న వడపళనికి చెందిన రాజ్కుమార్ను అరెస్టు చేశారు.