రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2021-01-16T05:38:43+05:30 IST

ఆదోని మండలం మదిరె గ్రామ సమీపాన గురువారం ఉదయం బొలొరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో 30 గొర్రెలు మృతి చెందాయి.

రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి

ఆదోని, జనవరి 15: ఆదోని మండలం మదిరె గ్రామ సమీపాన గురువారం ఉదయం బొలొరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో 30 గొర్రెలు మృతి చెందాయి.  మరో 26 గొర్రెలకు గాయాలు అయ్యాయి.  మహారాష్ట్రలోని  కొల్హాపూర్‌ గ్రామానికి చెందిన ధన్గర్‌ ఈరప్ప    తన గొర్రెలను మేపుకునేందుకు మదిరె వైపు వచ్చాడు.  ఈరప్ప పెద్దహరివాణం నుంచి  మాలపల్లి గ్రామం వైపు రోడ్డుపై గొర్రెలను తోలుకెళుతుండగా వేగంగా వచ్చిన బొలొరో వాహనం గొర్రెల మందలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందిగా, 26 గొర్రెలు గాయపడ్డాయి.   రూ.4 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందని గొర్రెల యజమాని అన్నాడు.  కేసు   దర్యాప్తు చేస్తున్నట్లు ఇస్వీ ఏఎ్‌సఐ రామ్‌నాథ్‌ తెలిపారు.  


Updated Date - 2021-01-16T05:38:43+05:30 IST