కారుని ఢీకొని రెండు ముక్కలైన ట్రాక్టర్... వైరల్ అవుతున్న ఫొటోలు!

ABN , First Publish Date - 2021-08-08T12:13:16+05:30 IST

రాజస్థాన్‌లోని జాలౌర్‌లో కారు, ట్రాక్టర్ బలంగా ఢీకొన్నాయి.

కారుని ఢీకొని రెండు ముక్కలైన ట్రాక్టర్... వైరల్ అవుతున్న ఫొటోలు!

జాలౌర్: రాజస్థాన్‌లోని జాలౌర్‌లో కారు, ట్రాక్టర్ బలంగా ఢీకొన్నాయి. దాని తీవ్రతకు ట్రాక్టర్ రెండు ముక్కలయ్యింది. కారు కూడా తునాతునకలైపోయింది. ఈ ఘటన తఖత్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాలౌర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గడ్డివాముతో వెళుతున్న ట్రాక్టర్, స్విఫ్ట్ కారు ఢీకొన్నాయి. 


ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ ప్రమాదం కారణంగా ట్రాక్టర్ రెండు ముక్కలు కావడం విచిత్రంగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారు ప్రస్తుతం సుమేర్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కారు ఆహోర్ నుంచి తఖత్‌గఢ్ వైపువెళుతోంది. ట్రాక్టర్ గడ్డివాముతో దుజానా నుంచి ఆహోర్ వైపు వెళుతోంది. రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు, కారులో ప్రయాణిస్తున్న ఒక వృద్ధుడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

Updated Date - 2021-08-08T12:13:16+05:30 IST