దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2022-01-25T05:21:03+05:30 IST
దైవదర్శనానికి వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డ సంఘ టన సోమవారం చోటు చేసుకుంది.
- మార్చాల సమీపంలో చెట్టును ఢీకొన్న కారు
- ఒకరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
కల్వకుర్తి, జనవరి 24 : దైవదర్శనానికి వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఎస్ఐ మహేందర్, స్థానికుల కథనం ప్రకారం... బాలానగర్ మండలం అమ్మపల్లికి చెందిన మామిళ్లపల్లి సుధాకర్, మహేశ్వరం మండలానికి చెందిన తన బంధువులు శ్రీరాములు(28), అరవింద్, ఉపేందర్, గణేష్, మహేష్లతో కలిసి బాలానగర్ నుంచి శ్రీశైలానికి షిఫ్ట్కారులో బయల్దే రారు. దైవ దర్శనానికి సుధాకర్ కారు నడుపుతూ వెళ్తున్నారు. మార్గమధ్య లో మార్చాల సమీపంలోని పాలకేంద్రం వద్ద పాల ట్యాంకర్ రోడ్డుకు అ డ్డురాగా, ఆ ట్యాంకర్ను తప్పించబోయి వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మహేశ్వరం మండ లం అమీన్పేట గ్రామానికి చెందిన శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెం దాడు. మిగిలిన ఐదుగురు సుధాకర్, అరవింద్, ఉపేందర్, గణేష్, మహే ష్లు తీవ్రంగా గాయపడ్డారు. చెట్టుకు కారు ఢీకొనడంతో కారు పూర్తిగా దెబ్బతినింది. కారులో నుంచి క్షతగాత్రులను బయటకు తీయడానికి స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మహేందర్ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు రెఫర్ చేశారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మహేందర్ తెలిపా రు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు.
ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడు..
అచ్చంపేటరూరల్: ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రా త్రి మండల పరిధిలోని శ్రీశైలం-మహబూ బ్న గర్ రహదారి లక్ష్మాపూర్ స్టేజీ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. అచ్చంపేట మండలం బోల్గట్పల్లి గ్రామా నికి చెందిన రామావత్ సురేష్(32) అచ్చంపే ట నుంచి బోల్గట్పల్లికు వెళ్తూగుర్తు తెలియని వాహనం ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై ప్రదీప్కుమార్ తెలిపారు. ఢీ కొట్టిన వాహనం వివరాలు తెలియాల్సి ఉందన్నారు. సురేష్ మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.
హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిలో...
వంగూరు: మండల పరిధిలోని వెల్మలపల్లి గేట్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిలోని వెల్మలపల్లి గేట్ వద్ద కాలి నడకతో వెళ్తున్న దూళ్ల బాల్రాం(55)ను వెనకాల బైక్ వచ్చి వేగంగా ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో బాల్రాం తలకు బలమైన గాయాలు తగల డంతో వెంటనే 108లో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాల్రాం సోమవారం మృతి చెందాడు. మృతుని స్వగ్రామం వంగూరు గేట్ కాలనీ. ప్రమా దానికి కారణమైన బైక్ను స్వాధీనం తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు.