ఆగివున్నలారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-06-27T13:23:26+05:30 IST

వేల్పూర్‌ క్రాస్‌రోడ్‌ దగ్గర రోడ్డుప్రమాదం ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో నుంచి ఒక్కసారిగా

ఆగివున్నలారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

నిజామాబాద్‌: వేల్పూర్‌ క్రాస్‌రోడ్‌ దగ్గర రోడ్డుప్రమాదం ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగినప్పుడు కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతులు జగిత్యాల వాసులుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-06-27T13:23:26+05:30 IST