Nizamabad: ఆగివున్న లారీని ఢీకొట్టిన కంటైనర్..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-07-18T15:26:22+05:30 IST

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. బాల్కొండ మండలం(Balkonda Mandal) కిసాన్‎నగర్ సమీపంలో 44వ నంబరు

Nizamabad: ఆగివున్న లారీని ఢీకొట్టిన కంటైనర్..ఇద్దరు మృతి

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. బాల్కొండ మండలం(Balkonda Mandal) కిసాన్‎నగర్ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారి(National Highway No.44)పై ఆగివున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ బాధితుడిని నిర్మల్ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హైవేపై రోడ్డు ప్రమాదం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‎ను క్లియర్ చేస్తూ వాహనాలను బాల్కొండ మీదుగా మళ్లిస్తున్నారు.

Updated Date - 2022-07-18T15:26:22+05:30 IST