నెత్తురోడిన బైపాస్ రోడ్డు!
ABN , First Publish Date - 2022-01-28T06:44:06+05:30 IST
హనుమాన్జంక్షన్ బైపాస్ రహదారి ట్రైల్రన్తో ప్రారంభించిన రెండ్రోజులకే వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలతో అసుపత్రి పాలయ్యారు.
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
హనుమాన్జంక్షన్ రూరల్, జనవరి 27 : హనుమాన్జంక్షన్ బైపాస్ రహదారి ట్రైల్రన్తో ప్రారంభించిన రెండ్రోజులకే వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలతో అసుపత్రి పాలయ్యారు. బొమ్ములూరు వద్ద బైపాస్ రహదారిలో ద్విచక్రవాహనంపై విజయవాడ నుంచి ఏలూరు వైపునకు వెళుతుండగా జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు బిందాన్ని కొండలరావు(64), నాగేశ్వరి(62)లు అక్కడిక్కడే మృతి చెందారు. విజయవాడ వాంబేకాలనీకి చెందిన కొండలరావు దంపతులు ఏలూరులో నివాసం ఉంటున్న కుమార్తెను పలకరించేందుకు ఉదయం 9గంటలకు వెళుతూ రామిలేరు వంతెన వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి పక్కనే డివైడర్ గోడను ఢీకొంది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారని రహదారి భద్రతా మెబైల్ ఎస్సై సుందరరావు తెలిపారు. మృతుడి సోదరుడు బిందాని చంద్రశేఖరరావు ఫిర్యాదు మేరకు ఎస్సై గౌతమ్కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.ఇదే రహదారిపై ఎస్.ఎన్.పాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం అదుపుతప్పి రేణిగుంటకు చెందిన సూర్య అనే యువకుడు మృతిచెందాడు. వాహనం నడుపుతున్న యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. రేణిగుంట జ్యోతినగర్కు చెందిన యువకులు ద్విచక్రవాహనంపై విజయవాడ నుంచి ద్వారకాతిరుమల దర్శనానికి వెళుతూ వాహనం అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108లో ఏలూరుకు తరలించిట్టు ఎస్సై గౌతమ్కుమార్ తెలిపారు.