కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-08-02T22:20:56+05:30 IST

సిద్దిపేట : జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం

సిద్దిపేట : జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిర్లక్ష్యంగా పడేసిన రాళ్ల లోడ్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. శ్రీగిరిపల్లెకు చెందిన భార్యభర్తలు మార్కుక్ రూట్‌లో బైక్‌ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీబీ (భార్య) అక్కడికక్కడే మృతి చెందగా, భర్త శబద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడ్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బీబీ మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-08-02T22:20:56+05:30 IST