Karimnagar: వీధి వ్యాపారులపైకి దూసుకెళ్లిన కారు..నలుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2022-01-30T13:44:48+05:30 IST

కరీంనగరలో ఘోర ప్రమాదం జరిగింది. కమాన్ చౌరస్తా వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు వీధి వ్యాపారుల పైకి

Karimnagar: వీధి వ్యాపారులపైకి దూసుకెళ్లిన కారు..నలుగురు దుర్మరణం

కరీంనగర్: కరీంనగర్‎లో ఘోర ప్రమాదం జరిగింది. కమాన్ చౌరస్తా వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‎ను ఢీకొట్టిన కారు వీధి వ్యాపారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు..కమాన్ చౌరస్తా వద్దకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. కారు నెంబర్ TS 02 EY 2121పై గతంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రమాదం గల ముఖ్య కారణం ఓవర్ స్పీడ్ వల్లే జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందినవారంతా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన స్వప్న, లలిత, జ్యోతి, సునితలుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-01-30T13:44:48+05:30 IST