బైక్ ఢీకొన్న లారీ..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-11-09T13:45:42+05:30 IST

ఎలమంచిలి మున్సిపాలిటి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కొక్కిరాపల్లిలో చోటు చేసుకుంది

బైక్ ఢీకొన్న లారీ..ఇద్దరు మృతి

విశాఖపట్నం: ఎలమంచిలి మున్సిపాలిటి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కొక్కిరాపల్లిలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కసింకోట మండలం పల్లపు సోమవరం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటన అర్ధరాత్రి ఎలమంచిలిలో తీర్థ మహోత్సవం చూసుకుని ఇంటికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-09T13:45:42+05:30 IST