Road accident: డివైడర్ను ఢీకొన్న ఫార్చ్యూనర్ కారు..మహిళ మృతి
ABN , First Publish Date - 2021-10-16T15:58:54+05:30 IST
ఆర్మూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెర్కిట్ వద్ద జాతీయ రహదారిపై డివైడర్ను ఫార్చ్యూనర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో
నిజామాబాద్: ఆర్మూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెర్కిట్ వద్ద జాతీయ రహదారిపై డివైడర్ను ఫార్చ్యూనర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఇచ్చోడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.