బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు యువకులు మృతి

ABN , First Publish Date - 2022-05-09T13:49:13+05:30 IST

జైపూర్ చెక్ పోస్టు అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు

బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు యువకులు మృతి

మంచిర్యాల: జైపూర్ చెక్ పోస్టు అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read more