చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-02-18T19:53:04+05:30 IST

చిత్తూరు జిల్లా: చంద్రగిరి మండలం, ఐతేపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా: చంద్రగిరి మండలం, ఐతేపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సిమెంట్ లోడ్‌తో వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విశాఖ వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి చిత్తూరులోని గోల్డెన్ టెంపుల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కారులోనే మృతదేహాలు చిక్కుకుపోవడంతో చంద్రగిరి ఎమ్మార్వోతోపాటు పోలీసు అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-02-18T19:53:04+05:30 IST