AP: అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..8 మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-11-15T14:20:42+05:30 IST

చిలమత్తూరు మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో

AP: అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..8 మందికి గాయాలు

అనంతపురం: చిలమత్తూరు మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను హిందూపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కోడూరుతోపు దగ్గర చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-15T14:20:42+05:30 IST