Road accident: కూలీలతో వెళ్తున్న మినీ ఐచర్ బోల్తా..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-11-07T13:54:18+05:30 IST

తాడిపత్రి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండలం నుంచి బ్రహ్మణపల్లెకు కూలీలతో పత్తి తీయడానికి వెళ్తున్న మినీ ఐచర్

Road accident: కూలీలతో వెళ్తున్న మినీ ఐచర్ బోల్తా..ఇద్దరు మృతి

అనంతపురం: తాడిపత్రి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మణపల్లెకు కూలీలతో పత్తి తీయడానికి వెళ్తున్న మినీ ఐచర్ లారీ చుక్కలూరు వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-07T13:54:18+05:30 IST