ఏర్పేడులో ఎదురేదురుగా ఢీకొన్న రెండు బస్సులు..15 మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-10-29T16:25:39+05:30 IST

శ్రీకాళస్తి టూ తిరుపతి మార్గంలోని ఏర్పేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి

ఏర్పేడులో ఎదురేదురుగా ఢీకొన్న రెండు బస్సులు..15 మందికి గాయాలు

తిరుపతి: శ్రీకాళస్తి టూ తిరుపతి మార్గంలోని ఏర్పేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-10-29T16:25:39+05:30 IST