HYD: మెట్టుగూడ చౌరస్తాలో మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన లారీ..డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2022-01-22T13:21:51+05:30 IST
మెట్టుగూడ చౌరస్తాలో తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. కాంక్రీట్ మిక్సర్ లారీ..మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది.
హైదరాబాద్: మెట్టుగూడ చౌరస్తాలో తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. కాంక్రీట్ మిక్సర్ లారీ..మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా..క్లీనర్కు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంతో మెట్టుగూడ చౌరస్తా వద్ద నుంచి..సికింద్రాబాద్ - తార్నాక మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.