మోటర్ సైకిళ్ల ఢీ.. వైద్యురాలి మృతి
ABN , First Publish Date - 2020-05-03T15:37:00+05:30 IST
మోటరు సైకిళ్లు ఢీకొన్న ఘటనలో గాయపడిన మహిళా వైద్యురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు.
చెన్నై : మోటరు సైకిళ్లు ఢీకొన్న ఘటనలో గాయపడిన మహిళా వైద్యురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. పెరంబలూర్కు చెందిన టైలర్ తమిళ్మణి కుమార్తె అఖిల(23) శివగంగ ప్రభుత్వాస్పత్రిలో ట్రైనీ డాక్టర్గా పనిచేస్తోంది. ఆమెకు మార్చి 28వ తేదీతో శిక్షణ పూర్తయ్యింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేలా మరో నెల పనిచేయాల్సి వచ్చింది. అఖిల, సహచార వైద్యురాలు వేలూరు జిల్లా గుడియాత్తంకు చెందిన ప్రబంజన్(23)తో కలసి ఓ సర్టిఫికేట్ నిమిత్తం మోటర్సైకిల్లో పూవందిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు.
కుయవన్విలై ప్రాంతంలో వస్తుండగా హఠాత్తుగా మరో మోటర్సైకిల్ ఢీకొంది. ఈ ఘటనలో అఖిల, ప్రబంజన్, మరో మోటార్సైకిల్పై వస్తున్న కరుపన్నన్ గాయపడ్డారు. అటుగా వస్తున్న వారు క్షతగాత్రులను శివగంగ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సలు ఫలించక అఖిల శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై పూవంతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.