Road accident: తిరుపతిలో రోడ్డు ప్రమాదం... భార్య మృతి

ABN , First Publish Date - 2022-07-28T17:03:56+05:30 IST

నగరంలోని చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది.

Road accident: తిరుపతిలో రోడ్డు ప్రమాదం... భార్య మృతి

తిరుపతి: నగరంలోని చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై దంపతులు తిరుపతికి వస్తుండగా....బైక్ అదుపుతప్పి ముందు ఐరన్ లోడ్డుతో వెళ్లుతున్న లారీ కింద పడింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా... భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు పులిచెర్ల మండలం దిన్నెపాటివారిపల్లికు చెందిన అమరావతి(30)గా గుర్తించారు. గాయపడిన భర్త మోహన్‌ను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-07-28T17:03:56+05:30 IST