Road accident: తిరుపతిలో రోడ్డు ప్రమాదం... భార్య మృతి
ABN , First Publish Date - 2022-07-28T17:03:56+05:30 IST
నగరంలోని చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది.
తిరుపతి: నగరంలోని చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై దంపతులు తిరుపతికి వస్తుండగా....బైక్ అదుపుతప్పి ముందు ఐరన్ లోడ్డుతో వెళ్లుతున్న లారీ కింద పడింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా... భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు పులిచెర్ల మండలం దిన్నెపాటివారిపల్లికు చెందిన అమరావతి(30)గా గుర్తించారు. గాయపడిన భర్త మోహన్ను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.