Road accident: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-08-10T13:48:27+05:30 IST

జిల్లాలోని ముప్కాల్ మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి 44పై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road accident: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్: జిల్లాలోని ముప్కాల్ మండల కేంద్రం వద్ద  జాతీయ రహదారి 44పై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. టైర్ పేలడంతో ఓ కారు అదుపుతప్పి గాల్లోకి ఎగిరి పల్టీలుకొడుతూ డివైడర్‌ను దాటి అవతలి రోడ్డులో పడింది.  ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.  సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-08-10T13:48:27+05:30 IST