Nandyal: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-06-16T13:37:01+05:30 IST

జిల్లాలోని తమ్మరాజుపల్లె వాగు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Nandyal: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నంద్యాల: జిల్లాలోని తమ్మరాజుపల్లె వాగు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు కడప జిల్లా చిట్వేలుకు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-16T13:37:01+05:30 IST