Nallagondaలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-06-14T13:21:44+05:30 IST

జిల్లాలోని నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.

Nallagondaలో రోడ్డు ప్రమాదం

నల్గొండ: జిల్లాలోని నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దామరచర్ల మండలం కొండ్రపోలు గ్రామంలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-14T13:21:44+05:30 IST