కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2022-02-01T02:30:21+05:30 IST
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జి. కొండూరు,
కృష్ణా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జి. కొండూరు, చెవుటూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. బస్సులోని ప్రయాణీకులు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదంతో జీ కొండూరు, మైలవరం వైపు ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ జె. ఎన్. ఎస్. బాబు. తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కుంచిపత్తికి చెందిన పద్మ, పెనువల్లికి చెందిన మరీదు వినీలా చనిపోయారు.. మృతులు ఇద్దరిని తెలంగాణకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న జీ కొండూరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.