దుండిగల్లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
ABN , First Publish Date - 2022-05-09T16:34:51+05:30 IST
నగరంలోని దుండిగల్ గాగిల్లాపూర్ చౌరస్తాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
హైదరాబాద్: నగరంలోని దుండిగల్ గాగిల్లాపూర్ చౌరస్తాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మీద వెళ్తున్న వ్యక్తిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సంగారెడ్డి జిల్లా కొర్లకుంట గ్రామానికి చెందిన స్వామి(34)గా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.