Chittoorలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-07-08T16:02:30+05:30 IST

జిల్లాలోని పూతలపట్టు మండలం టి.రంగంపేట ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

Chittoorలో రోడ్డు ప్రమాదం

చిత్తూరు: జిల్లాలోని పూతలపట్టు మండలం టి.రంగంపేట ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు తిరుపతి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-07-08T16:02:30+05:30 IST