ఆటోను ఢీకొట్టిన కారు..అక్కడికక్కడే ఆటో డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-11-01T17:29:58+05:30 IST

ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌...

ఆటోను ఢీకొట్టిన కారు..అక్కడికక్కడే ఆటో డ్రైవర్‌ మృతి

హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్‌: ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం, ఉత్తటూర్‌ గ్రామానికి చెందిన శ్రీశైలం (46) ఆటో డ్రైవర్‌. నల్గొండ చర్లపల్లి నుంచి ఆటోలో టపాసుల లోడ్‌తో హైదరాబాద్‌కు వస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున ఆటో బాటసింగారం కొత్తగూడెం బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దాంతో శ్రీశైలం తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. 

Updated Date - 2021-11-01T17:29:58+05:30 IST