HYD : గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్‌లు దుర్మరణం.. రెండు ముక్కలైన కారు..

ABN , First Publish Date - 2021-12-18T13:16:22+05:30 IST

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో జూనియర్ ఆర్టిస్టు సిద్ధుకు

HYD : గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్‌లు దుర్మరణం.. రెండు ముక్కలైన కారు..

హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్లిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నది. ప్రమాదంలో కారు రెండు ముక్కలైంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్‌లు, ఒకరు బ్యాంక్ ఉద్యోగి ఉన్నారు. మరో జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతులను జూనియర్ ఆర్టిస్టులు ఎం. మానస, ఎన్.మానసగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


అబ్దుల్ రహీం విజయవాడలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఫ్రెండ్ ఇంట్లో పార్టీ పూర్తయ్యాక గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అతివేగం నిర్లక్ష్యం, మద్యం మత్తు వలనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. మరణించిన ఎం. మానస మహబూబ్‌నగర్‌‌‌కు, ఎన్. మానస కర్ణాటకకు చెందినవారు. సీరియల్ షూటింగ్ నిర్వహించేందుకు సాయి సిద్దు ఇద్దరు యువతులను పిలిపించారు. 100 కిలోమీటర్ల వేగంతో కారు చెట్టును ఢీ కొనడం గమనార్హం. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-12-18T13:16:22+05:30 IST