Road Accident: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-08-05T13:31:32+05:30 IST

బెలుగుప్ప మండలం, కాలువ పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

అనంతపురం (Anantapuram) జిల్లా: బెలుగుప్ప మండలం, కాలువ పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వంతెన మీద నిల్చున్న మహిళలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళల మృతదేహాలు మాంసపు ముద్దల్లా మారాయి. పేరూరు డ్యామ్ నుంచి నీటిని దిగువకు వదలడంతో చూసేందుకు మహిళలు వచ్చారు. ఈ ప్రమాదంలో సరస్వతి, లక్ష్మీదేవి అనే మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత లారీ ఆగకుండా వెళ్లిపోవడంతో గ్రామస్తులు వెంబడించి కాల్వపల్లి సమీపంలో పట్టుకుని, పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.  

Updated Date - 2022-08-05T13:31:32+05:30 IST