Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-07-24T18:52:33+05:30 IST

తిరుపతి జాతీయ రహదారి, పూతలపట్టు మండలం, చౌటపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా (Chittoor Dist.): తిరుపతి (Tirupathi) జాతీయ రహదారి, పూతలపట్టు మండలం, చౌటపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Sccident) జరిగింది. అదుపుతప్పిన కారు (Car) డివైడర్‌ను ఢీకొని పక్కరోడ్డులోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కర్నాటక (Karnataka) పోలీసులు మృతి చెందారు. ఎస్‌ఐ అవినాష్, కానిస్టేబుల్ అనిల్, డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎస్ఐ దీక్షిత్, కానిస్టేబుళ్లు శరవణ, బసవకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వారిని దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంజాయి స్మగ్లర్ల (Marijuana smugglers)ను పట్టుకునేందుకు బెంగళూరు (Bangalore) నుంచి రెండు వాహనాల్లో కర్నాటక పోలీసులు వచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారం అందవలసి ఉంది. 

Updated Date - 2022-07-24T18:52:33+05:30 IST