రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-03-04T05:39:28+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

పరిస్థితి విషమం,ఎంజీఎంకు తరలింపు

ఏటూరునాగారం, మార్చి 3: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని 163 జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు మంగపేట మండల కేంద్రానికి చెందిన సోడి పాపారావు(25)తో పాటు ఆయన స్నేహితుడైన ఏటూరునాగారం మండలం దొడ్ల కొత్తూరుకు చెందిన సోల రమేష్‌ (26) బుధవారం సాయంత్రం (నూగూరు) వెంకటపురం తమ బంధువుల ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో 163 జాతీయ రహదారిపై ఎదురుగా ఇసుక లారీ అతి వేగంతో వస్తోంది. కాగా బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో లారీని తప్పించబోయి ద్విచక్ర వాహనం బోల్తా కొట్టింది. కాగా రమేష్‌ లోయలో పడిపోగా పాపారావు రోడ్డుపై కాళ్లు చేతులు విరిగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాటసారులు 108 సమాచారం అందించి ఏటూరునాగారంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-03-04T05:39:28+05:30 IST