రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి

ABN , First Publish Date - 2020-12-05T05:46:44+05:30 IST

మండలంలోని సోమన్నపాలెం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి

 మరో ఇద్దరికి స్పల్ప గాయాలు

ఎలమంచిలి రూరల్‌, డిసెంబరు 4 : మండలంలోని సోమన్నపాలెం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సం బంధించి రూరల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాలివి. రాంబిల్లి మండలం లాలంకోడూరుకు చెందిన రుత్తల అప్పారావు బైక్‌పై ఎల మంచిలి మండలం కొత్తలిలో ఉంటున్న అత్తవారింటికి బయల్దేరాడు. సోమన్నపాలేనికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొంది. దీంతో రుత్తల అప్పారావు (50)కు తీవ్ర గాయాలు కావడంతో  ఎలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదే ఘటనలో లంకా రామచంద్రరావు, భీశెట్టి ఈశ్వరరావులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.


Updated Date - 2020-12-05T05:46:44+05:30 IST