బైక్ను కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-11-29T06:03:20+05:30 IST
ఇక్కడి ప్రభుత్వ పాఠశాల ఎదురుగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
కోటవురట్ల, నవంబరు 28 : ఇక్కడి ప్రభుత్వ పాఠశాల ఎదురుగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సురేష్కుమార్ కథనం ప్రకారం వివరాలివి. కోటవురట్లకు చెందిన జానకి బాబూరావు (54) తన సోదరిని రాట్నాలపాలెంలో ఉన్న అత్తవారింటి బైక్పై తీసుకు వెళ్తుండగా, కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సన్యాసిరావు కారుతో వస్తూ బైక్ను ఢీకొన్నారు. దీంతో బాబూరావు తలకు తీవ్ర గాయాలు కావడంతో అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పంపగా, అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.