AP: బైక్‎ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-09-03T13:07:23+05:30 IST

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగాం మండలం కాపు తెంబూరు జంక్షన్ సమీపంలో బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై

AP: బైక్‎ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

శ్రీకాకుళం: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగాం మండలం కాపు తెంబూరు జంక్షన్ సమీపంలో బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ చిన్నబడాం గ్రామానికి చెందిన మజ్జి లక్ష్మణ్ రావు (36), గేదెల ప్రకాష్ (33)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-09-03T13:07:23+05:30 IST